లక్ష ఉద్యోగాలు ఇస్తా... లేకుంటే పాస్పోర్ట్ సీజ్ చేయండి: ka paul
ABN , First Publish Date - 2022-05-03T23:18:15+05:30 IST
లక్ష ఉద్యోగాలు ఇస్తా... లేకుంటే పాస్పోర్ట్ సీజ్ చేయండి: ka paul
హైదరాబాద్: తనపై జరిగిన దాడిని కుల సంఘాలు, వివిధ పార్టీలు ఖండించారని కేఏ పాల్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని తాను కోరుకున్నానని చెప్పారు. తాను ఆంధ్రా వాడినని అంటున్నారని, కేసీఆర్ ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకోవాలన్నారు. తన పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవని, అన్నీ చారిటీల మీద ఉన్నాయన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డికి నిన్నటి నుంచి కాల్ చేస్తున్నా ఇప్పటివరకు తన కాల్ లిఫ్ట్ చేయడం లేదన్నారు. తనను ఎంతకాలం నిర్బంధిస్తారని కేఏ పాల్ ఆయన ప్రశ్నించారు.
తనపై తెలంగాణ వ్యతిరేకి ముద్ర వేస్తున్నారని అన్నారు. సిరిసిల్ల రైతులకు అండగా నిలవడం తాను చేసిన తప్పా?, తనపై జరిగిన దాడి తెలంగాణ ప్రజల మీద జరిగిన దాడన్నారు. పీకేతో తాను టచ్లో ఉన్నానని తెలిపారు. అన్ని పార్టీలను కలపాలని సీఎం చెప్పినట్లు.. పీకే తనతో చెప్పాడని వెల్లడించారు. 150 దేశాలను వణికించి వచ్చానని, కేసీఆర్, కేటీఆర్లకు తాను బయపడేది లేదన్నారు. అన్ని పార్టీలకు సభలకు అనుమతులు ఇస్తున్నారు తనకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో నేను లక్ష ఉద్యోగాలు ఇస్తాను. లేకుంటే నా పాస్పోర్ట్ను సీజ్ చేసుకోండన్నారు.