నేను రాష్ట్రపతి అభ్యర్థి కాదు.. తటస్థ అభ్యర్థిని ఎన్డీఏకు సూచించా: కేఏ పాల్

ABN , First Publish Date - 2022-06-16T18:38:54+05:30 IST

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. ఆర్థిక వ్యవస్థ బాగోలేదని.. ప్రధాని మోదీ(PM Modi), అమిత్ షా(Amith Shah)లకు స్పష్టంగా చెప్పానని ప్రజాశాంతి పార్టీ..

నేను రాష్ట్రపతి అభ్యర్థి కాదు.. తటస్థ అభ్యర్థిని ఎన్డీఏకు సూచించా: కేఏ పాల్

ఢిల్లీ : దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. ఆర్థిక వ్యవస్థ బాగోలేదని.. ప్రధాని మోదీ(PM Modi), అమిత్ షా(Amith Shah)లకు స్పష్టంగా చెప్పానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) వెల్లడించారు. నేడు ఆయన ఢిల్లీ(Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. ఎకానమీ సమ్మిట్ పెట్టాలని కోరానన్నారు. బీజేపీ అభ్యర్ధే రాష్ట్రపతి(President) ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ప్రతిపక్షాలు ఐక్యం కావాలన్నారు. ప్రతిపక్షాలు వేరు వేరు కుటములుగా ఉండొద్దని పాల్ సూచించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ఓడిపోయే వారి పక్షాన ఉండను. ప్రతిపక్షాల్లో ఐక్యత లేదు. ప్రతిపాదించన వారు కూడా రాష్ట్రపతి అభ్యర్థులుగా ఉండటానికి ఇష్టపడటం లేదు. బీజేపీ అభ్యర్ధి 60 శాతం ఓట్లతో గెలుస్తారు. నేను రాష్ట్రపతి అభ్యర్థి కాదు. బీజేపీ, కాంగ్రెస్ వల్ల దేశం నాశనం అయిపోతోంది. దేశ అభివృద్ధిపై రాజకీయ పక్షాలు దృష్టి సారించాలి. ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోవడం వల్లే బీజేపీ బలంగా ఉంది. మంచి తటస్థ అభ్యర్థిని ఎన్డీఏకి ప్రతిపాదించా. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మోడీ, అమిత్ షా, పురుషోత్తం రూపాలకు తెలిపా. నాతో 18 పార్టీలు సేవ్ సెక్యులర్ ఇండియా కుటమిలో ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో నాలుగు కూటములుగా ఉన్నాయి. కేసీఆర్‌(KCR)తో సేవ్ సెక్యులర్ ఇండియా రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించా. కేసీఆర్‌కి వచ్చే ఎన్నికల్లో ఎంపీలు ఉండరు’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-06-16T18:38:54+05:30 IST