లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నవారినెందుకు అరెస్ట్ చేయరు? : KA Paul

ABN , First Publish Date - 2022-06-22T18:15:39+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతిపై సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్‌కు ఫిర్యాదు చేశానని కేఏ పాల్ తెలిపారు.

లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నవారినెందుకు అరెస్ట్ చేయరు? : KA Paul

ఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కుటుంబం చేస్తున్న అవినీతిపై సీబీఐ డైరెక్టర్(CBI Director) సుబోద్ కుమార్ జైశ్వాల్‌కు ఫిర్యాదు చేశానని కేఏ పాల్(KA Paul) తెలిపారు. ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్‌తో సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం, కేటీఆర్, కవిత చేస్తున్న అవినీతిపై ఇంతవరకు ఎవరూ సరైన ఫిర్యాదు ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద రూ.లక్షా ఐదు వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పానన్నారు. తనపై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్టు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇంకా పాల్ మాట్లాడుతూ..‘‘ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, జగన్మోహన్‌రెడ్డి చేసిన అవినీతిపై గురించి మాట్లాడాను. రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతుంటే ఎందుకు వారిని అరెస్ట్ చేయరని అడిగా. ఆధారాలు లేకుండా నేను ఏదీ మాట్లాడను. నేనేం చేయాలో నాకు తెలుసు. రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడిని చేయవద్దు నేను సూచించాను. నేను మొదటినుంచి షెడ్యూల్డ్ కులాలకు చెందిన మహిళలకు రాష్ట్రపతి ఇవ్వాలని బీజేపీకి చెప్పాను. ఒడిశాలోని ఓ షెడ్యూల్ కులానికి చెందిన ద్రౌపదిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం సంతోషం’’ అని పేర్కొన్నారు.


Updated Date - 2022-06-22T18:15:39+05:30 IST