హైదరాబాద్లో ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీకి కేఏ పాల్ ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-04-26T23:14:44+05:30 IST
నగరంలోని టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీకి కేఏ పాల్ మంగళవారం ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: నగరంలోని టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీకి కేఏ పాల్ మంగళవారం ఫిర్యాదు చేశారు.అధికార పార్టీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు పెట్టారని చెప్పారు. ఎక్కడ చూసినా కేసీఆర్, కేటీఆర్, కవిత ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయన్నారు. అనుమతులు లేని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించినందుకు .. ఈ ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని కేఏ పాల్ ఫిర్యాదు చేశారు.