అవకాశం ఇస్తే తెలంగాణాను తీర్చిదిద్దుతా
ABN , First Publish Date - 2022-05-18T16:28:24+05:30 IST
ఒక్కసారి అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్ది నిరుద్యోగ సమస్యను పూర్తిగా నిర్మూలిస్తానని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
హైదరాబాద్/అమీర్పేట: ఒక్కసారి అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్ది నిరుద్యోగ సమస్యను పూర్తిగా నిర్మూలిస్తానని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు బుధవారం బేగంపేట చికోటి గార్డెన్లో లీడర్లు, పాస్టర్లు, బిష్పలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అమీర్పేటలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 21రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ గడిచిన ఎనిమిదేళ్లలో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో ముస్లింలు, క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 95శాతం మంది పాస్టర్లు తనతోనే ఉన్నారని కొంతమంది హిందూ, క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టే వాళ్లే తనను వ్యతిరేకిస్తున్నారని కేఏ పాల్ అన్నారు.