ఆనందం మూడింతలు

ABN , First Publish Date - 2020-10-27T06:24:57+05:30 IST

విజయదశమి పర్వదినాన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.

ఆనందం మూడింతలు

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు
అమలాపురం టౌన, అక్టోబరు 26: విజయదశమి పర్వదినాన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అమలాపురం శ్రీవెంకటసాయి శ్రావణి మహిళా ఆస్పత్రిలో రాజోలు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన అడబాల శిరీషకు ఆదివారం పురుడు పోశారు. ఇద్దరు మగబిడ్డలు, ఒక ఆడ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. తల్లీపిల్లలంతా ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్‌ గొట్టుముక్కల శ్రావణి తెలిపారు.

Updated Date - 2020-10-27T06:24:57+05:30 IST