కబడ్డీ పోటీలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-01-25T04:58:32+05:30 IST
మండలంలోని బోయిన్పల్లి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం మొదటి రోజు కబడ్డీ పోటీలను సర్పంచ్ త్రివిక్రమరావు, ఉపసర్పంచ్ నర్సప్ప, మాజీ ఎంపీటీసీ ఎం.వెంకటయ్య, టీఆర్ఎస్ మండల నాయకుడు కె.బాలరాజు ప్రారంభించారు.
నారాయణపేటరూరల్, జనవరి24: మండలంలోని బోయిన్పల్లి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం మొదటి రోజు కబడ్డీ పోటీలను సర్పంచ్ త్రివిక్రమరావు, ఉపసర్పంచ్ నర్సప్ప, మాజీ ఎంపీటీసీ ఎం.వెంకటయ్య, టీఆర్ఎస్ మండల నాయకుడు కె.బాలరాజు ప్రారంభించారు. ఈపోటీల్లో వివిధ మండలాల నుంచి 35 జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులకు బోయిన్పల్లి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో భోజన వసతి ఏర్పాటు చేశారు. సోమవారం రెండోరోజు పోటీలు జరుగుతాయని, అందులో గెలిచిన వారికి ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.