11నుంచి రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు

ABN , First Publish Date - 2021-03-09T05:19:15+05:30 IST

మహా శివరాత్రి జాతర పురస్కరించుకుని మండల పరిధిలోని నేరడ గ్రామంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌) స్థాయి కబడ్టీ పోటీలు ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సంఘ బాధ్యుడు దూసరి నేతాజీ తెలిపారు.

11నుంచి రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు

చింతకాని మార్చి8: మహా శివరాత్రి జాతర పురస్కరించుకుని మండల పరిధిలోని నేరడ గ్రామంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌) స్థాయి కబడ్టీ పోటీలు ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సంఘ బాధ్యుడు దూసరి నేతాజీ తెలిపారు. మొదటి బహుమతి రూ.40 వేలు, రెండవ బహుమతి రూ.30 వేలు, మూడవ బహుమతి రూ.20 వేలు, 4వ బహుమతి రూ.12 వేలు, 5వ బహుమతి రూ.10 వేలు, 6వ బహుమతి రూ.6వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఔత్సాహికులు ఎంట్రీలను పంపాల్సిందిగా (9700643222) కోరారు.


Updated Date - 2021-03-09T05:19:15+05:30 IST