ముగిసిన జాతీయస్థాయి కబడ్డీ పోటీలు

ABN , First Publish Date - 2021-01-17T05:25:29+05:30 IST

మండలంలోని ముప్పాళ్ళ గ్రామంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు శనివారం రాత్రి ముగిశాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 45 జట్లు పొల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ముగిసిన జాతీయస్థాయి కబడ్డీ పోటీలు
విజేతలకు బహుమతులు అందజేస్తున్న జీవీ ఆంజనేయులు

ప్రకాశం జిల్లా చినగంజాం జట్టుకు ప్రథమ స్థానం

ఈపూరు, జనవరి 16: మండలంలోని ముప్పాళ్ళ గ్రామంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు శనివారం రాత్రి ముగిశాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 45 జట్లు పొల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. నాకౌట్‌ కమ్‌ లీగ్‌ పద్ధతిలో జరిగిన పోటీలలో ప్రకాశం జిల్లా చినగంజాం జట్టు ప్రథమ స్థానం సాధించగా, గుంటూరు జిల్లా ఆరేపల్లి ముప్పాళ్ళ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. తృతీయ బహుమతి చినగంజాం (జూనియర్‌) జట్టు పొందాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా నెహ్రూనగర్‌, పిడుగురాళ్ళ సెవన్‌ స్టార్స్‌, వైజాగ్‌,  లక్ష్మీ నరసింహ జట్టు, ముప్పాళ్ళ యోగి జట్టు, తిరుమల కాలేజి (నరసరావుపేట) జట్లు నిలిచాయి. బహుమతులను టీడీపీ నరసరావుపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అందజేశారు. కార్యక్రమంలో రాపర్ల జగ్గారావు, సూరే కోటేశ్వరరావు, తల్లపనేని రామారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-17T05:25:29+05:30 IST