చెయ్యేరు నదిలో ఆర్టీసీ బస్సు మునక...ముగ్గురు మృతి
ABN , First Publish Date - 2021-11-19T19:13:05+05:30 IST
జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహానికి అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట తెగిపోయింది.
కడప: జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహానికి అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట తెగిపోయింది. దీంతో చెయ్యేరులోకి వరద ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలో చెయ్యేరు నది దాటేందుగు యత్నిస్తుండగా ఓ ఆర్టీసీ బస్సు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కొందరు ప్రయాణికులు బస్ టాప్పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. సాయం కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.