ఆత్మకూరు ఘటనలో శ్రీకాంత్ రెడ్డికి బెయిల్ మంజూరు

ABN , First Publish Date - 2022-02-18T17:21:32+05:30 IST

ఆత్మకూరు ఘటనలో నంద్యాల పార్లమెంట్ బీజేపీ అద్యక్షులు బుడ్డాశ్రీకాంత్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యింది.

ఆత్మకూరు ఘటనలో శ్రీకాంత్ రెడ్డికి బెయిల్ మంజూరు

కడప: ఆత్మకూరు ఘటనలో నంద్యాల పార్లమెంట్ బీజేపీ అద్యక్షులు బుడ్డాశ్రీకాంత్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యింది. బెయిల్ పత్రాలను కడప కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌కు బీజేపీ నేతలు అందజేశారు. పత్రాలను పరిశీలించిన అనంతరం  శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు విడుదల చేశారు. కేంద్ర కారాగారం వద్దకు భారీగా చేరుకున్న బీజేపీ శ్రేణులు... శ్రీకాంత్ రెడ్డికి స్వాగతం పలికారు. కాగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. 

Updated Date - 2022-02-18T17:21:32+05:30 IST