Kadapa: నకిలీ ఇళ్ళ పట్టాల మాఫియా ముఠాగుట్టు రట్టు

ABN , First Publish Date - 2022-05-05T17:40:34+05:30 IST

బద్వేల్ పట్టణంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు నకిలీ ఇళ్ళ పట్టాల మాఫియా ముఠా గుట్టు రట్టు చేశారు.

Kadapa: నకిలీ ఇళ్ళ పట్టాల మాఫియా ముఠాగుట్టు రట్టు

కడప జిల్లా: బద్వేల్ పట్టణంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు నకిలీ ఇళ్ళ పట్టాల మాఫియా ముఠా గుట్టు రట్టు చేశారు. నకిలీ ఇళ్ల పట్టాలు తయారీ వ్యవహారంపై అధికారులు గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి మెరుపు దాడులు చేశారు. బద్వేలు ఆర్డీవో ఆకుల వెంకట రమణ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. మూడు ఇళ్ళపై సోదాలు నిర్వహించి నకిలీ ఇళ్ల పట్టాల తయారీకి ఉపయోగించే సీల్స్, నకిలీ పత్రాలు, స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో సుమిత్రా నగర్‌కు చెందిన రవిశంకర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బద్వేల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంపై ఆర్డీవో వెంకటరమణ లోతుగా అధ్యయనం చేపట్టారు. నకిలీ ఇళ్ల పట్టాల తయారీలో వైసీపీ శ్రేణుల పాత్ర ఉన్నట్లు సమాచారం.

Read more