విషాదం... తల్లి, ఇద్దరు బిడ్డలు మృతి

ABN , First Publish Date - 2021-10-31T00:05:53+05:30 IST

విషాదం... తల్లి, ఇద్దరు బిడ్డలు మృతి

విషాదం... తల్లి, ఇద్దరు బిడ్డలు మృతి

కడప: జిల్లాలోని చిన్నమండెం మండలం కొత్తపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. నీటికుంటలో పడి తల్లి, ఇద్దరు బిడ్డలు మృతి చెందారు. మృతులు అనిత (27), గణేష్ (6) భార్గవ్ (4)గా గుర్తించారు. మృతులు రాయచోటి మండలం సిద్ధారెడ్డిపల్లె వాసులుగా గుర్తించారు. ఆ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. 

Updated Date - 2021-10-31T00:05:53+05:30 IST