20వ రోజూ నిర్వాసితుల ఆందోళన
ABN , First Publish Date - 2020-09-23T06:55:04+05:30 IST
మండలంలోని తాళ్లప్రొద్దుటూరు నిర్వాసితుల ఆందోళన మంగళవారం 20వ రోజుకు చేరింది. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా
కొండాపురం, సెప్టెంబరు 22: మండలంలోని తాళ్లప్రొద్దుటూరు నిర్వాసితుల ఆందోళన మంగళవారం 20వ రోజుకు చేరింది. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా నిర్వాసితులు తెలిపారు. ఇళ్లలోకి నీళ్లు రాకుండా వెంటనే ఆపాలని, పరిహారం అందరికీ ఇవ్వాలని, కటాఫ్ డేట్ పెంచాలని, వెలిగొండ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచు నరసింహారెడ్డి, సీపీఐ ఏరియా కార్యదర్శి సుబ్బారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు చాంద్బాషా, సీపీఐ మండల కార్యదర్శి మనోహర్బాబు తదితరులు పాల్గొన్నారు.