రాజంపేట వైసీపీలో ముదురుతున్న వర్గవిభేధాలు

ABN , First Publish Date - 2022-01-13T15:28:10+05:30 IST

రాజంపేట వైసీపీలో వర్గ విబేధాలు ముదురుతున్నాయి.

రాజంపేట వైసీపీలో ముదురుతున్న వర్గవిభేధాలు

కడప: రాజంపేట వైసీపీలో వర్గ విబేధాలు ముదురుతున్నాయి. వైసీపీ రెబల్ కౌన్సిలర్ రాఘవేంద్ర వర్మపై ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పోలీసులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. రాఘవేంద్ర పట్టాభూమిలో ఉన్న సమాధి మండపాన్ని పోలీసులు జేసీబీతో కూల్చివేశారు. తమ పట్టాభూమిలో ఉన్న పెద్దల సమాధి మండపాన్ని కూల్చవద్దని రాఘవేంద్ర కాళ్ళ వేళ్లాపడ్డప్పటికీ పోలీసులు కనికరించని పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-01-13T15:28:10+05:30 IST