ఎదురేదురుగా ఢీకొన్న RTC బస్సులు..10 మందికి గాయాలు
ABN , First Publish Date - 2022-08-27T17:20:03+05:30 IST
ఖాజీపేట అంబేద్కర్ సర్కిల్లో రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. అదుపుతప్పిన రెండు ఆర్టీసీ బస్సులు ఎదురేదురుగా ఢీకొన్నాయి.
Kadapa: ఖాజీపేట అంబేద్కర్ సర్కిల్లో రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. అదుపుతప్పిన రెండు ఆర్టీసీ బస్సులు ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఒక బస్సు డ్రైవర్ బస్సులో ఇరుక్కుపోవడంతో స్థానికులు బయటకు తీశారు. డ్రైవర్కు తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. మరో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.