సంగమం కథాసంపుటి ఆవిష్కరణ
ABN , First Publish Date - 2021-07-26T06:00:06+05:30 IST
స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి ఆలయ ధార్మికప్రాంగణం పద్మావతి కళావేదికపై ఆదివారం ప్రముఖ రచయిత్రి గోటేటి లలితా శేఖర్ రచించిన సంగమం కథాసంపుటి పుస్తకావిష్కరణ సభ జరిగింది.
గుంటూరు (సాంస్కృతికం), జూలై 25: స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి ఆలయ ధార్మికప్రాంగణం పద్మావతి కళావేదికపై ఆదివారం ప్రముఖ రచయిత్రి గోటేటి లలితా శేఖర్ రచించిన సంగమం కథాసంపుటి పుస్తకావిష్కరణ సభ జరిగింది. సభకు రచయిత మోదుగుల రవికృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిఽథిగా పాల్గొన్న రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు. సభలో అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీ నారాయణ, రచయిత్రి కుందుర్తి స్వరాజ్యపద్మజ, భోగరాజు సీతాకృష్ణకుమారి, డాక్టర్ వెలువోలు నగరాజలక్ష్మి, రావెల సాంబశివరావు, ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.