Kadapa: రాజంపేట వైసీపీ నేతల మధ్య వర్గ విబేధాలు
ABN , First Publish Date - 2021-12-27T19:49:21+05:30 IST
జిల్లాలోని రాజంపేట వైసీపీ నేతల మధ్య వర్గ విబేధాలు పెరుగుతున్నాయి.
కడప: జిల్లాలోని రాజంపేట వైసీపీ నేతల మధ్య వర్గ విబేధాలు పెరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, కడప జెడ్పీ చైర్మన్ అమర్నాధ్ రెడ్డి వర్గాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నందలూరులో రైళ్లను ఆపాలని అమరనాధ్ రెడ్డి వర్గం ఆమరణ దీక్షకు దిగింది. మరోవైపు రైళ్ళను ఆపాలని ఎమ్మెల్యే మేడా వర్గం ఎంపీపీ మేడా విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చలో గుంతకల్ కార్యక్రమం చేపట్టారు. నందలూరు ఎంపీపీ మేడా విజయ భాస్కర్ రెడ్డి గుంతకల్ వెళ్ళి డీఆర్ఎంకు వినతి పత్రం సమర్పించనున్నారు.