కజ్జికాయలు

ABN , First Publish Date - 2020-11-14T16:39:33+05:30 IST

మైదా - పావుకేజీ, వెన్న - యాభై గ్రాములు, కొబ్బరి తురుము - 200గ్రాములు, చిక్కటి పాలు - పావు లీటరు, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌, పంచదార - 150గ్రాములు.

కజ్జికాయలు

కావలసినవి: మైదా - పావుకేజీ, వెన్న - యాభై గ్రాములు, కొబ్బరి తురుము - 200గ్రాములు, చిక్కటి పాలు - పావు లీటరు, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌, పంచదార - 150గ్రాములు.


తయారీ విధానం: ఒక పాత్రలో మైదా పిండి తీసుకుని అందులో వెన్న వేసి కలపాలి. తరువాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి మెత్తటి మిశ్రమంలా అయ్యేలా కలియబెట్టుకోవాలి. తరువాత ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తరువాత తురిమిన కొబ్బరి వేసి చిన్న మంటపై వేగించాలి. తరువాత అందులో చిక్కటి పాలు పోసి కలపాలి. యాలకుల పొడి వేసి కాసేపు వేగించుకోవాలి. దాంతో కజ్జికాయల్లోకి స్టఫింగ్‌ రెడీ అయినట్టే. కలిపి పెట్టుకున్న మైదా పిండి కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న సైజు పూరీలా ఒత్తుకోవాలి. మధ్యలో కొబ్బరి స్టఫ్‌ పెట్టి అంచులు మూయాలి. ఇదే సమయంలో పంచదార పానకం తయారుచేసి పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోయాలి, నూనె వేడెక్కిన తరువాత కజ్జికాయలు వేసి వేగించాలి. తరువాత వాటిని పంచదార పానకంలో వేయాలి. అంతే... నోరూరించే కొబ్బరి కజ్జికాయలు రెడీ.

Updated Date - 2020-11-14T16:39:33+05:30 IST