కాకాణి కేసుపై సీఎం ఆతృత ఎందుకో..?: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2022-05-08T02:52:33+05:30 IST

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కేసులో సాక్ష్యాల దొంగతనం కేసును సీబీఐకి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎందుకు ఆతృత పడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో

కాకాణి కేసుపై సీఎం ఆతృత ఎందుకో..?: వర్ల రామయ్య

విజయవాడ: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కేసులో సాక్ష్యాల దొంగతనం కేసును సీబీఐకి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎందుకు ఆతృత పడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ కేసును కూడా బాబాయి వివేకా కేసులాగా సాగతీయొచ్చనా? అసలు దోషులు దొరక్కుండా చేయొచ్చనా? అని నిలదీశారు. ఈ విషయంలో గౌరవ హైకోర్టు జాగ్రత్తగా వ్యవహరించాలని, వీలుంటే న్యాయవిచారణ చేయుంచాలని శనివారం ఆయన ట్విట్టర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు.

Read more