జూలై 7 నుంచి కాకతీయ వైభవ సప్తాహం
ABN , First Publish Date - 2022-07-07T01:29:54+05:30 IST
వరంగల్ : కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలు జూలై 7 నుంచి ఏడు రోజుల పాటు జరగనున్నాయి. 700 ఏళ్ల తర్వాత ఓరుగల్లు గడ్డపై కాకతీయుల వారసులు కాలు మోపబోతున్నారు. 22వ తరం వారసుడు కమల్ చంద్ భంజ్ దేవ్ కాకతీయకు ఘన స్వాగతం పలికేందుకు కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్లో ఏర్పాట్లు చేశారు. భద్రకాళీ అమ్మవారి
వరంగల్ : కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలు జూలై 7 నుంచి ఏడు రోజుల పాటు జరగనున్నాయి. 700 ఏళ్ల తర్వాత ఓరుగల్లు గడ్డపై కాకతీయుల వారసులు కాలు మోపబోతున్నారు. 22వ తరం వారసుడు కమల్ చంద్ భంజ్ దేవ్ కాకతీయకు ఘన స్వాగతం పలికేందుకు కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్లో ఏర్పాట్లు చేశారు. భద్రకాళీ అమ్మవారి దర్శనం అనంతరం ఆయనను అశ్వక దళంతో ఊరేగింపుగా తీసుకురానున్నారు. 700 మంది పేరిణి కళాకారులతో మహా ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. కోటలో అశ్వక విన్యాసాలు అబ్బుర పరుస్తున్నాయి.