Sea: రంగు మారిన సముద్రం

ABN , First Publish Date - 2022-07-19T01:36:03+05:30 IST

కాకినాడ జిల్లా (Kakinada District) ఉప్పాడ తీరంలో సముద్రం రంగు మారి పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ఎ

Sea: రంగు మారిన సముద్రం

ఉప్పాడ: కాకినాడ జిల్లా (Kakinada District) ఉప్పాడ తీరంలో సముద్రం రంగు మారి పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు కాలువల ద్వారా వచ్చి సముద్రం (Sea)లోకి చేరుతుంది. దీంతో నీలం రంగులా ఉండే సముద్రం వరద నీటితో ఎర్రగా దర్శనమిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తుంది. వరద నీరు సముద్రపు నీటిలో కలిసేందుకు వారం నుంచి పదిరోజుల వ్యవధి పడుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. వరదలు (floods), తుఫాన్‌లు వచ్చినప్పుడల్లా ఉప్పాడ తీరంలో సముద్రం రెండు రంగుల్లో కనిపిస్తుందని పేర్కొంటున్నారు.

Updated Date - 2022-07-19T01:36:03+05:30 IST