Kakinada: జీజీహెచ్లో corona కలకలం
ABN , First Publish Date - 2022-07-09T16:36:03+05:30 IST
జీజీహెచ్లో కరోనా కలకలం రేగింది. 10 మంది నర్సింగ్ విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
కాకినాడ: జీజీహెచ్లో కరోనా(Corona) కలకలం రేగింది. 10 మంది నర్సింగ్ విద్యార్థినుల(Nursing students)కు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. జీజీహెచ్ వార్డుల్లో కొన్ని రోజులుగా విద్యార్థినులు విధులు నిర్వహిస్తున్నారు. కోవిడ్ పాజిటివ్ నేపథ్యంలో బాధితులను ఎస్ఎస్ఆర్ వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. నర్సింగ్ విద్యార్థినిలకు కోవిడ్ నిర్ధారణ కావడంతో వారు విధులు నిర్వహించిన వార్డుల్లోని రోగులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.