కాకినాడలో ఆందోళన చేస్తున్న Studentsపై పోలీసుల ప్రతాపం

ABN , First Publish Date - 2021-11-12T17:59:50+05:30 IST

ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనానికి వ్యతిరేకంగా కాకినాడలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ప్రతాపం చూపించారు.

కాకినాడలో ఆందోళన చేస్తున్న Studentsపై పోలీసుల ప్రతాపం

కాకినాడ: ఎయిడెడ్  విద్యాసంస్థల విలీనానికి వ్యతిరేకంగా కాకినాడలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ప్రతాపం చూపించారు. దొరికిన వారిని దొరికినట్లు విద్యార్థులను లాఠీలతో చితక్కొట్టారు. విద్యార్థులు కలెక్టరేట్ గేటును నెట్టి లోపలకు వెళ్లే ప్రయత్నం చెయ్యడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్రలు, లాఠీలతో మహిళా విద్యార్థులను కూడా పోలీసులు బాదేశారు. దీంతో యువతులు నొప్పితో కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. పోలీసుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-11-12T17:59:50+05:30 IST