TDPలోకి YCP నేతలు స్వచ్ఛందంగా వస్తున్నారు: Kala Venkata Rao

ABN , First Publish Date - 2022-06-12T19:22:50+05:30 IST

టీడీపీలోకి వైసీపీ నేతలు స్వచ్ఛందంగా వస్తున్నారని టీడీపీ నేత కళా వెంకటరావు తెలిపారు.

TDPలోకి YCP నేతలు స్వచ్ఛందంగా వస్తున్నారు: Kala Venkata Rao

Srikakulam జిల్లా: తెలుగుదేశం పార్టీ(TDP)లోకి వైసీపీ (YCP) నేతలు స్వచ్ఛందంగా వస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకటరావు (Kala Venkata Rao) తెలిపారు. శ్రీకాకుళం జిల్లా, ఎస్.ఎం.పురం నుంచి ఏడుగురు వార్డు సభ్యులు టీడీపీలో చేరటం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు ఒరిగేదేమీ లేదని అర్ధమయ్యిందన్నారు. చంద్రబాబు (Chandrababu) విజనరీ లీడర్ అని, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని అన్నారు. టీడీపీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని కళా వెంకటరావు అన్నారు. 

Updated Date - 2022-06-12T19:22:50+05:30 IST