కళాశాలను ప్రభుత్వానికి అప్పగించాలి

ABN , First Publish Date - 2021-11-25T06:37:36+05:30 IST

కళాశాలను ప్రభుత్వానికి అప్పగించాలి

కళాశాలను ప్రభుత్వానికి అప్పగించాలి
ఆందోళన చేస్తున్న విద్యార్థులు

ఉయ్యూరు, నవంబరు 24 : ఏజీ అండ్‌ ఎస్‌జీఎస్‌ కళాశాలను ప్రభుత్వానికి అప్పగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. కళాశాలను ప్రభుత్వ కళాశాలగా ప్రకటించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందో ళన చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం జాతీయ గీతం ఆలపించారు.  ఎస్‌ ఎఫ్‌ఐ మండల కార్యదర్శి సుకేష్‌ మాట్లాడుతూ యాజమాన్యం, ప్రభుత్వం  విద్యా ర్థుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొసాగిస్తామ న్నారు. దాతలు, ప్రజల సహయంతో  ప్రారంభించిన కళాశాల ప్రైవేటుగా నిర్వహిం చడం అన్యాయమన్నారు. కళాశాల నిర్వహించ లేని పక్షంలో  ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతిరోజు తరగతులకు హాజరవుతూ శాంతి యుతంగా నిరసన తెలియజేస్తామన్నారు.

Updated Date - 2021-11-25T06:37:36+05:30 IST