నేటి నుంచి త్రివేణి సంగమం వద్ద పిండప్రదానాలు బంద్
ABN , First Publish Date - 2021-04-23T06:00:22+05:30 IST
నేటి నుంచి త్రివేణి సంగమం వద్ద పిండప్రదానాలు బంద్
మహదేవపూర్, ఏప్రిల్ 22 : కరోనా ప్రభావం అన్నింటిమీద పడుతోంది. దినదినం కొవిడ్ కేసులు పెరుగుతోండడంతో పిండప్రదానాలను నిలిపివేస్తున్నారు. ఇం దులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద శుక్రవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు స్వచ్ఛందంగా శ్రార్థకర్మలను నిలిపివేస్తున్నట్లు బ్రాహ్మణ సంఘం నాయకులు గురువారం తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న క్రమంలో ఆ కార్యక్రమాలను బంద్ చేస్తున్నట్లు వివరించారు. కాళేశ్వరం వచ్చేవారు ఈ విషయాన్ని గమనించాలని వారు తెలిపారు.