Kaleshwaram పుష్కరఘాట్‌ దగ్గర గోదావరి ఉధృతి

ABN , First Publish Date - 2022-07-10T21:47:16+05:30 IST

కాళేశ్వరం (Kaleshwaram) పుష్కరఘాట్‌ దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతోంది. 15 మీటర్ల మేర గోదావరి (Godavari) నీటి ప్రవాహం ప్రవహిస్తోంది

Kaleshwaram పుష్కరఘాట్‌ దగ్గర గోదావరి ఉధృతి

కాళేశ్వరం: కాళేశ్వరం (Kaleshwaram) పుష్కరఘాట్‌ దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతోంది. 15 మీటర్ల మేర గోదావరి (Godavari) నీటి ప్రవాహం ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర నీటిమట్టం పెరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ 75 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) దగ్గర ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 8,66,070 క్యూసెక్కులుగా ఉంది. అన్నారం బ్యారేజీ 50 గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదల చేశారు. అన్నారం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3,55,000 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. మూడు రోజులుగా రాష్టంలో వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల ఎడతెరిపి లేకుండా వానపడింది. శుక్రవారం దక్షిణ తెలంగాణలో భారీవర్షాలు పడగా.. శనివారం ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. 


12 లేదా 13న మరో అల్పపీడనం

ఈ నెల 12 లేదా 13న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికితోడు తూర్పు, పడమర ద్రోణి మరికొన్ని రోజులు దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్యే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో మధ్య, పశ్చిమ భారతం, ఏపీ, తెలంగాణల్లో అనేకచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

Updated Date - 2022-07-10T21:47:16+05:30 IST