కలిచెర్లకు నేతల ఘన నివాళి
ABN , First Publish Date - 2022-01-26T06:41:44+05:30 IST
తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకరరెడ్డి మృతికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు.
కలిచెర్ల కుటుంబానికి మంత్రుల పరామర్శ
నేడు అంత్యక్రియలు
పెద్దమండ్యం, జనవరి 25: తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకరరెడ్డి మృతికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కలిచెర్ల ప్రభాకరరెడ్డి, ఆదివారం మధ్యాహ్నం బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో మృతిచెందిన విషయం తెలిసిందే. కుటుంబీకులు ఆయన మృతదేహాన్ని సోమవారం రాత్రి స్వగ్రామం కలిచెర్లకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎన్.రెడ్డెప్ప, బీజేపీ జాతీయ నేత చల్లపల్లె నరసింహారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎం.నవాజ్బాషా, వెంకటేగౌడ, రాయచోట ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, జడ్పీ చైర్పర్సన్ రెడ్డెమ్మ, సీకె లావణ్య, మున్సిపల్ వైస్చైర్మన్ జింకా వెంకటాచలపతి, నల్లారి తిమ్మారెడ్డి, భూమన సుబ్రహ్మణ్యం తదితరులు కలిచెర్ల మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్రెడ్డి అన్న కలిచెర్ల సుధాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి సతీమణి ఇందరమ్మను పరామర్శించారు. అప్పకు నివాళులర్పించేందుకు మదనపల్లె, తంబళ్లపల్లె నియోజక వర్గంలోని అభిమానులు పెద్దసంఖ్యలో కలిచెర్లకు చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం బయ్యారెడ్డిగారి స్మృతివనంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.