Kallakurichi Schoolgirl Death: తమిళనాడులో సంచలనం రేపిన విద్యార్థిని మృతి కేసులో సుప్రీం కీలక సూచన
ABN , First Publish Date - 2022-07-21T17:38:48+05:30 IST
తమిళనాడులో (Tamilnadu) రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన కళ్లకురిచి జిల్లా చిన్న సేలం ప్లస్-2 విద్యార్థిని అనుమానాస్పద మృతిపై (Kallakurichi Schoolgirl Death) సుప్రీం కోర్టు (Supreme Court) బాధితురాలి తండ్రికి..
కళాశాల గదుల్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారు. ఓ గదిని పెట్రోల్ పోసి తగులబెట్టారు. కళాశాల ఎదుట పోలీసులు అడ్డుగా నిలిపి ఉంచిన ఇనుప బారికేడ్లను కూడా ఆందోళనకారులు తొలగించి వాటిని కూడా ధ్వంసం చేశారు. చివరకు పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తుపాకులతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు. అదనపు బలగాలను మొహరించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు హింసను విడనాడకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ పాండ్యన్ హెచ్చరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కళ్లకురిచి తాలూకాలో 144వ నిషేధాజ్ఞలు విధించారు. కళ్లకురిచిలో విద్యార్థిని మృతిపై జరుగుతున్న ఆందోళన విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.