కల్తీ సారా, మద్యం అరికట్టాలని మహిళల ఆందోళన

ABN , First Publish Date - 2022-03-19T22:33:17+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో మహిళలు రోడ్డుపై బైఠాయించి కల్తీ సారా, మద్యం అరికట్టాలని ఆందోళన చేపట్టారు.

కల్తీ సారా, మద్యం అరికట్టాలని మహిళల ఆందోళన

ద్వారకాతిరుమల: పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో తెలుగుదేశం  ఆధ్వర్యంలో మహిళలు రోడ్డుపై బైఠాయించి కల్తీ సారా, మద్యం అరికట్టాలని ఆందోళన చేపట్టారు. పార్టీ పిలుపుమేరకు శ్రేణులు ఏపీ వ్యాప్తంగా  బ్రాందీ షాపుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తిమ్మాపురంలోని భీమడోలు-ద్వారకాతిరుమల రోడ్డుపై మహిళలు, టీడీపీ నాయకులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం బ్రాందీ బాటిళ్లను పగలగొట్టి  నిరసన వ్యక్తం చేశారు. జె బ్రాండ్ మద్యాన్ని, జె టాక్స్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. కల్తీ సారా తాగడం వల్ల  రాష్ట్రంలో చాలా మంది చనిపోతున్నారన్నారు. సీఎం జగన్ పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారం సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు లంకా  సత్యనారాయణ, మండల టీడీపీ నాయకులు పోలిన శీను, మాజీ జెడ్పీటీసీలు బీవీయస్  చౌదరి, ఏపూరి దాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-19T22:33:17+05:30 IST