కాలువ పోరంబోకు కబ్జా
ABN , First Publish Date - 2022-01-25T02:36:45+05:30 IST
మండలంలోని కానుగచెట్ల కాలనీ సమీపంలో ఉన్న సాగునీటి కాలువ కరకట్టలతోపాటు పోరంబోకు స్థలం ఆక్రమణకు గు
బుచ్చిరెడ్డిపాళెం,జనవరి24: మండలంలోని కానుగచెట్ల కాలనీ సమీపంలో ఉన్న సాగునీటి కాలువ కరకట్టలతోపాటు పోరంబోకు స్థలం ఆక్రమణకు గురైంది. కబ్జాదారులు ఆ స్థలంలో బోరు వేసి ఇంటి నిర్మాణానికి పునాదులు వేశారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దీనికితోడు పెట్రోలు బంకు సమీపంలోకి కాలువ పోరంబోకు కూడా కబ్జా చేసి, మొక్కలు నాటినా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. బుచ్చి మండలంలో పలు చోట్ల నీటిపారుదల కాలువలు ఆక్రమణలకు గురవుతున్నా, అధికారుల మౌనం ఎందుకో అర్థంకావడం లేదని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.