టీడీపీ నేతలపై కక్షతోనే కేసులు బనాయిస్తున్నారు: కాల్వ

ABN , First Publish Date - 2020-08-08T19:11:49+05:30 IST

అనంతపురం: తెలుగుదేశం పార్టీ నాయకులపై రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు.

టీడీపీ నేతలపై కక్షతోనే కేసులు బనాయిస్తున్నారు: కాల్వ

అనంతపురం: తెలుగుదేశం పార్టీ నాయకులపై రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి, అస్మిత్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో 54 రోజులపాటు రిమాండులో ఉండి, బెయిలుపై వచ్చి 24 గంటలు గడవక ముందే తిరిగి అరెస్టు చేయడాన్ని రాజకీయ ప్రేరేపిత చర్యగానే భావించాల్సి ఉంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీల వారి పట్ల ప్రభుత్వం కక్షపూరిత ధోరణిని విడనాడాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-08T19:11:49+05:30 IST