కామాక్షి ఆలయంలో కల్యాణ మహోత్సవం

ABN , First Publish Date - 2021-04-18T05:02:42+05:30 IST

జనగామలోని కామాక్షి దేవాలయంలో శనివారం కామాక్షి ఏకామేశ్వర్లు కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

కామాక్షి  ఆలయంలో కల్యాణ మహోత్సవం
కల్యాణం జరిపిస్తున్న వేద పండితులు

కళ్యాణ్‌నగర్‌, ఏప్రిల్‌ 17: జనగామలోని కామాక్షి దేవాలయంలో శనివారం కామాక్షి ఏకామేశ్వర్లు కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.   గోదావరిఖని ట్రాఫిక్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కల్యాణార్థం ఈ కల్యాణాన్ని నిర్వహించారన్నారు. అనంతరం ఆలయంలో లలిత సహస్ర పారాయణం, పూర్ణాహుతి, రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్‌ కార్పొరేటర్‌ జనగామ కవితసరోజిని, వీరయ్యచార్యులు, నూతి సత్యనారాయణ, బొజ్జ శ్రీనివాస్‌, కుమారస్వామి, మారం వెంకటేష్‌, రుద్రభట్ల రమేష్‌శర్మ, రవీంద్రచారి, రాజమౌళి, నడిపెల్లి గోపాల్‌రావు, తిరుమలేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T05:02:42+05:30 IST