Kamal Haasan: తమిళ గడ్డపై బాంబుల సంస్కృతి అనుమతించం..

ABN , First Publish Date - 2022-09-26T16:34:47+05:30 IST

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంగా పేరుపొందిన తమిళనాడులో బాంబుల సంస్కృతిని అనుమతించే ప్రసక్తే లేదని మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ పేర్కొన్నారు

Kamal Haasan: తమిళ గడ్డపై బాంబుల సంస్కృతి అనుమతించం..

చెన్నై/ప్యారీస్‌: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంగా పేరుపొందిన తమిళనాడులో బాంబుల సంస్కృతిని అనుమతించే ప్రసక్తే లేదని మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో, రాష్ట్రంలో ఇటీవల కాలంలో బీజేపీ, హిందూ మున్నని, ఆర్‌ఎ్‌సఎస్‌ తదితర సంస్థలకు చెందిన నిర్వాహకుల ఇళ్లు, వాహనాలపై పెట్రోల్‌ బాంబులతో దాడులు, హింసాత్మక సంఘటనలు టీవీ సీరియల్లా కొనసాగడంపై రాష్ట్రప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకేరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్న సంఘవిద్రోహులను ఇప్పటివరకు అరెస్ట్‌ చేయలేదని, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న వారు ఇలాంటి చర్యలకు పాల్పడరని, డీఎంకే ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని శాంతి భద్రతలు పరిరక్షించి ప్రజలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని కమల్‌హాసన్‌ అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-09-26T16:34:47+05:30 IST