కమనీయం.. అగస్త్యేశ్వరస్వామి వారి కల్యాణం

ABN , First Publish Date - 2021-05-11T04:43:33+05:30 IST

మాస శివరాత్రి సందర్భంగా సోమవారం స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని కమనీయంగా కనులపండువగా నిర్వహించారు.

కమనీయం.. అగస్త్యేశ్వరస్వామి వారి కల్యాణం
అగస్త్యేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌, మే 10: మాస శివరాత్రి సందర్భంగా సోమవారం స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని కమనీయంగా కనులపండువగా నిర్వహించారు. ఉదయం నాలుగున్నర గంటల నుంచి లోకకల్యాణార్థం గణపతి, నవగ్రహ, శాంతి, రుద్రహోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆలయ కాలక్షేప మండపంలో ప్రత్యేక వేదికపై గంగాగౌరీ సమేత అగస్త్యేశ్వరస్వామిని ఆశీనులను చేసి సుందరంగా అలంకరించారు. వేద పండితులు సుముహూర్తంలో స్వామివారి కల్యాణంను శా స్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా నిబంధనలను అనుసరించి స్వామివారి కల్యాణం, హోమాలు నిర్వహించినట్లు ఆలయ ఛైర్మన్‌ శెట్టిపల్లె రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు విజయకుమార్‌, రమ్యకృష్ణ, నాగరాజు, దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T04:43:33+05:30 IST