టీవీఎస్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు...వ్యక్తికి గాయాలు

ABN , First Publish Date - 2020-10-29T20:22:08+05:30 IST

జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

టీవీఎస్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు...వ్యక్తికి గాయాలు

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. టీవీఎస్ ఎక్సెల్‌ను కరీంనగర్ డిపో 1 కు చెందిన ఆర్టీసీ బస్సు  ఢీకొట్టింది. ఈ ప్రమాదందలో ఎక్సెల్‌పై ప్రయాణిస్తున్న పసుల పోశయ్య (63)కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ డ్రైవర్ మల్లయ్యను తీవ్రంగా చితకబాదారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన పోశయ్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-10-29T20:22:08+05:30 IST