Kamareddy: తొమ్మిదేళ్ల బాలికపై 49 సంవత్సరాల వ్యక్తి అత్యాచారం

ABN , First Publish Date - 2022-06-15T15:44:14+05:30 IST

జిల్లాలోని తాడ్వాయి మండలంలో దారుణం జరిగింది.

Kamareddy: తొమ్మిదేళ్ల బాలికపై 49 సంవత్సరాల వ్యక్తి అత్యాచారం

కామారెడ్డి: జిల్లాలోని తాడ్వాయి మండలం ఎర్రపహడ్ గ్రామంలో దారుణం జరిగింది.  తొమ్మిదేళ్ల బాలికపై 49 సంవత్సరాల వయసు గల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటివద్ద ఆడుకుంటుండగా చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి కామాంధుడు ఇంతటి దారుణానికి యత్నించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-15T15:44:14+05:30 IST