Kamareddy: తొమ్మిదేళ్ల బాలికపై 49 సంవత్సరాల వ్యక్తి అత్యాచారం
ABN , First Publish Date - 2022-06-15T15:44:14+05:30 IST
జిల్లాలోని తాడ్వాయి మండలంలో దారుణం జరిగింది.
కామారెడ్డి: జిల్లాలోని తాడ్వాయి మండలం ఎర్రపహడ్ గ్రామంలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై 49 సంవత్సరాల వయసు గల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటివద్ద ఆడుకుంటుండగా చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి కామాంధుడు ఇంతటి దారుణానికి యత్నించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.