ఎన్నాళ్లకెన్నాళ్లకు...
ABN , First Publish Date - 2020-09-28T19:54:35+05:30 IST
కంభం చెరువు జలకళను సంతరించుకుంది. అల్పపీడన ప్రభావంతో శుక్రవారం రాత్రి..
కంభం(ప్రకాశం): కంభం చెరువు జలకళను సంతరించుకుంది. అల్పపీడన ప్రభావంతో శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. గుండ్లకమ్మ, జంపలేరు వాగుల ద్వారా ఆదివారం నాటికి 17 అడుగుల మేర నీరు చేరింది. ఆరేళ్ల తర్వాత ఇంత నీరు రావడం ఇప్పుడే. 2014లో 20 అడుగుల నీరు చేరింది. వర్షాలు కురిస్తే ఈసారి పూర్తిగా నిండే అవకాశం ఉందని ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. చెరువు అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.