టీడీపీ నిర్మించిన కరకట్ట వల్లే భద్రాచలం సురక్షితం: తుమ్మల నాగేశ్వరావు
ABN , First Publish Date - 2022-07-17T23:49:27+05:30 IST
వరుసగా కురిసిన వర్షానికి భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహించింది.1986 నాటి జల ప్రళయం మళ్లీ వస్తుందన్నట్టుగా పరిస్థితి ...
ఖమ్మం (Kammam): వరుసగా కురిసిన వర్షానికి భద్రాచలం (Badhrachalam) వద్ద గోదావరి (Godavari) ఉప్పొంగి ప్రవహించింది.1986 నాటి జల ప్రళయం మళ్లీ వస్తుందన్నట్టుగా పరిస్థితి నెలకొంది. అప్పుడు దాదాపు 600 గ్రామాల్లోకి గోదావరి వరద నీరు చేరింది. భారీగా నష్టం వాటిల్లింది. అయితే ఇప్పుడు గోదావరి జల ప్రళాయానికి కరకట్ట అడ్డుకట్టుగా నిలిచింది. నాటి కరకట్ట నిర్మాణంలో భాగస్వామిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు (Ex Minister Tummala Nageswararao) ఉన్నారు. ప్రస్తుతం కరకట్ట వల్లే భద్రాచలం పట్టణంలోకి గోదావరి నీరు రాలేదని ఆయన తెలిపారు. జీవితంలో చేసిన అభివృద్ధి పనులే మిగులుతాయని.. పదవులు కాదని చెప్పారు. దూరదృష్టితో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ కరకట్టను నిర్మించిందని... ఇప్పుటి గోదావరి జల ప్రళయం నుంచి భద్రాచలానికి రక్షణగా నిలిచిందన్నారు. వరద వచ్చినా కూడా తట్టుకునేలా ఈ కరకట్ట నిర్మాణం జరిగిందని చెప్పారు. ఎన్టీఆర్ (Ntr) హయాంలో కరకట్ట నిర్మించాలని నిర్ణయించామని.. 2000 సంవత్సరం చంద్రబాబు (Chandrababu) హయాంలో పూర్తి చేశామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేశారు.