కనకదుర్గమ్మగా కటాక్షించిన అమ్మవారు
ABN , First Publish Date - 2022-10-02T05:02:35+05:30 IST
దసరా శరన్నవరాత్రి ఉత్సవా ల్లో భాగంగా పట్టణంలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో కనక దుర్గమ్మగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
మదనపల్లె రూరల్, అక్టోబరు1: దసరా శరన్నవరాత్రి ఉత్సవా ల్లో భాగంగా పట్టణంలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో కనక దుర్గమ్మగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణం లోని ఆలయాల్లో ఉదయం పంచామృ తాభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆల య కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. నీరుగట్టువారిపల్లెలో చౌడేశ్వరిదేవి ఆలయంలో చౌడేశ్వరీ దేవి ని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉప్పు రామచంద్ర, సెక్రటరీ గుండ్లపల్లె ప్రభాకర్, ట్రెజరర్ రామిశెట్టి లోకేష్ ఆధ్వర్యంలో సాయంత్రం కనకదుర్గాదేవిగా అలంకరించి పూజలు చేశారు. పట్టణంలో వాసవీభవన్ వీధిలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు రామచంద్రశర్మ అమ్మవారిని లలితాదేవిగా అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మద నపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్, ట్రెజరర్ సూరేగిరిధర్, సెక్రటరీ దేవత సతీష్, మహిళసంఘా ల సభ్యులు, ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు. అలాగే పట్ట ణంలోని కోర్టు ఆవరణలో ఉన్న కోర్టులో గంగమ్మ ఆలయాన్ని శోభాయ మానంగా అలంకరించారు. అధికసంఖ్యలో మహిళ లు, భక్తులు పాల్గొని పూజలు చేశారు. విజయదశమి సంద ర్భంగా ఉత్సవాలల్లో భాగంగా దుర్గమాతను ప్రత్యేకంగా అలకంరించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు.