శాకంబరీ దేవిగా కనకమహాలక్ష్మి

ABN , First Publish Date - 2021-07-26T03:55:18+05:30 IST

పట్టణంలో వెలసిన కనకమహాలక్ష్మి అమ్మవారు ఆదివారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

శాకంబరీ దేవిగా కనకమహాలక్ష్మి
ప్రత్యేక అలకంరణలో కనకమహాలక్ష్మి అమ్మవారు

చీపురుపల్లి: పట్టణంలో వెలసిన  కనకమహాలక్ష్మి అమ్మవారు ఆదివారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాడమాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరీ దేవిగా ముస్తాబు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ ఇప్పిలి గోవిందరావు, ఈవో జి.శ్రీనివాస్‌, ఆలయ పూజారి ఆరవెల్లి శ్రీనివాసరావు, రవి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. కనకమహాలక్ష్మిని దర్శంచుకునేందుకు  పట్టణం తో పాటు పరిసర ప్రాంత  భక్తజనం క్యూలైన్‌లో బారులు దీరారు. అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
 
 

Updated Date - 2021-07-26T03:55:18+05:30 IST