రాజ్యసభలో రుయా మరణాలపై కనకమేడల నోటీసులు
ABN , First Publish Date - 2021-07-28T17:44:48+05:30 IST
రాజ్యసభలో రుయా మరణాలపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నోటీసులు ఇచ్చారు. తిరుపతి రుయాలో కోవిడ్ మరణాలపై దర్యాప్తు చేయాలన్నారు
ఢిల్లీ : రాజ్యసభలో రుయా మరణాలపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నోటీసులు ఇచ్చారు. తిరుపతి రుయాలో కోవిడ్ మరణాలపై దర్యాప్తు చేయాలన్నారు. కరోనాతో కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే నష్టపరిహారమివ్వాలన్నారు. రాష్ట్రం పరిహారమిచ్చేలా కేంద్రం ఆదేశాలివ్వాలని కనకమేడల కోరారు.