జగన్ మెతక వైఖరి వల్ల రాష్ట్రానికి నష్టం: కనకమేడల
ABN , First Publish Date - 2021-07-16T23:48:43+05:30 IST
తెలంగాణతో సీఎం జగన్ మెతక వైఖరి వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని ఎంపీ కనకమేడల రవీంద్ర దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో
అమరావతి: తెలంగాణతో సీఎం జగన్ మెతక వైఖరి వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని ఎంపీ కనకమేడల రవీంద్ర దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. అనంతర కనకమేడల మీడియాతో మాట్లాడుతూ జల వివాదంపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో పెట్రోల్పై అదనపు ట్యాక్స్ విషయాన్ని ప్రస్తావిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తున్నాం అని.. పదేపదే చెప్పిన సీఎం ఏం సాధించారు? అని కనకమేడల ప్రశ్నించారు. తెలుగు భాష, విద్యా విధానాన్ని నాశనం చేయడంపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు. న్యాయవ్యవస్థపై దాడి అంశంపై పోరాడాలని నిర్ణయం తీసుకున్నామని కనకమేడల రవీంద్ర తెలిపారు.