సనాతన ధర్మం పురాతనం, ప్రాశస్త్యం
ABN , First Publish Date - 2022-07-02T07:01:31+05:30 IST
పునర్జన్మను నమ్ముకున్న కర్మభూమిలో సత్కార్యాలతోనే అధ్యాత్మికోన్న తి లభిస్తుందని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ వి జయేంద్ర సరస్వతీ స్వామి అన్నారు.
కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి
జగ్గయ్యపేట, జూలై 1 : పునర్జన్మను నమ్ముకున్న కర్మభూమిలో సత్కార్యాలతోనే అధ్యాత్మికోన్న తి లభిస్తుందని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ వి జయేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. జగ్గయ్యపేట బీ కన్వెన్షన్లో తాత్వికులు, శివానంద ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్టు వ్యవస్థాపకులు గెంటేల వెం కట రమణ దంపతుల ఆధ్వర్యంలో స్వామికి నిర్వహించిన స్వాగతసభలో భక్తులకు ఆయన అనుగ్రహభాషణం చేశారు. వేల సంవత్సరాల క్రితం దే శంలో ఒకే సంస్కృతి ఆచరణలో ఉన్నప్పుడు పూర్ణశాంతి ఉందన్నారు. సృష్టి ఆరంభంలో మానవ సు ఖం, శాంతి, వికాసం, సుహృద్భావం, భద్రతలకు ధర్మం చెప్పబడిందన్నారు. గుడి ఆదాయాన్ని ధర్మప్రచారానికి వినియోగించాలని, సామాజిక సమరసతకు, మనస్సు పరిపక్వతకు అనేక ప్రయత్నాలు చేయాలన్నారు. నిత్యం గీతా పారాయణం చేస్తూ అనుసరించటమే ఉత్తమోత్త ధర్మమన్నారు. తొలు త స్వామికి గెంటేల వెంకటరమణ దంపతులు, ప్ర భుత్వ విప్ సామినేని ఉదయభాను, మునిసిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర స్వాగతం పలికా రు. బీ కన్వెన్షన్ అధినేత కోలపల్లి బుల్లిబాబు కు టుంబానికి స్వామి ఆశీస్సులు అందజేశారు. తర్వా త స్వామి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆహ్వానం మేరకు ఆయన నివాసాన్ని దర్శించారు.