అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయురాలి మృతి

ABN , First Publish Date - 2021-03-02T05:54:13+05:30 IST

తొట్టంబేడు మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు మాలిని సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయురాలి మృతి

శ్రీకాళహస్తి, మార్చి 1: అనుమానాస్పద స్థితిలో తొట్టంబేడు మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయురాలు సోమవారం మృతిచెందారు. వివరాలివీ.. తొట్టంబేడు మండలం కంచనపల్లెకు చెందిన మాలిని(40) కేవీబీపురం మండలం కాళంగిఆదరం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త భుజంగరావు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, ప్రస్తుతం కంచనపల్లెలో కాపురం ఉంటున్నారు. కాగా, సోమవారం ఉదయం విధులకు వెళ్లిన ఆమె సాయంత్రం ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో మాలిని ఆరోగ్యం బాగోలేదంటూ రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులు శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయురాలు మృతిచెందడంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది. 

Updated Date - 2021-03-02T05:54:13+05:30 IST