కందుల దృష్టికి స్థానిక సమస్యలు
ABN , First Publish Date - 2021-10-27T05:04:29+05:30 IST
పొదిలి పట్టణంలోని పలు సమస్యలను మాజీ ఎమ్మెల్యే కందుల నారాయనరెడ్డి దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు.
పొదిలి, అక్టోబరు 26 : పొదిలి పట్టణంలోని పలు సమస్యలను మాజీ ఎమ్మెల్యే కందుల నారాయనరెడ్డి దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. ఒం గోలు వెళ్తూ మార్గమధ్యంలోని స్థానిక పార్టీ కార్యాలయం వద్ద కొంతసేపు ఆగిన కందులను నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానికులు కొందరు సమస్యలను తెలియజేశారు. అనంతరం ఆయన సమస్యల పరి ష్కారానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు. రాబోయే ఎన్ని కలలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఎవరు అధైర్యపడాల్సిన పనిలేదని కందుల భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షుడు మీగడ ఓబుల్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముల్లాఖుద్దూస్, జిల్లా నాయకులు షేక్రసూల్, షేక్గౌస్, వై.వెంకటేశ్వరరెడ్డి, యాసిన్, మౌలాలి, గోపీనాథ్, బాబూరావు, ఉడుముల చిన్నపురెడ్డి, వెంకటేశ్వర్లు, సయ్యద్గఫార్ తదితరులు ఉన్నారు.