ఫార్మా సిటీ పేలుడు ఘటన దిగ్భ్రాంతి కలిగించింది : కన్నా

ABN , First Publish Date - 2020-07-14T17:47:07+05:30 IST

విశాఖపట్నం ఫార్మా సిటీలో జరిగిన పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని

ఫార్మా సిటీ పేలుడు ఘటన దిగ్భ్రాంతి కలిగించింది : కన్నా

అమరావతి : విశాఖపట్నం ఫార్మా సిటీలో జరిగిన పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు బీజేపీ సంతాపం తెలియచేస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కన్నా డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం చేయించి, నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా.. పేలుడు ఘటనలో ఒకరు గుర్తు పట్టని స్థితిలో కాలిపోయి ఉండగా.. నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-07-14T17:47:07+05:30 IST