Kanpur Test: నాలుగు వికెట్లు కోల్పోయిన కివీస్..

ABN , First Publish Date - 2021-11-27T18:42:47+05:30 IST

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట కొనసాగుతుంది. ఓవర్ నైట్ స్కోర్ 129/0 తో ఆటను ప్రారంభించింది. క్రీజులో పాతుకుపోయిన కివీస్ ఓపెనర్లను విడదీశాడు. 66 ఓవర్‎లో అశ్విన్ వేసిన బంతికి విల్ యంగ్

Kanpur Test: నాలుగు వికెట్లు కోల్పోయిన కివీస్..

కాన్పూర్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట కొనసాగుతుంది. ఓవర్ నైట్ స్కోర్ 129/0 తో ఆటను ప్రారంభించింది. క్రీజులో పాతుకుపోయిన కివీస్ ఓపెనర్లను అశ్విన్ విడదీశాడు. 66 ఓవర్‎లో అశ్విన్ వేసిన బంతికి విల్ యంగ్ (89) కీపర్‎కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో టీమిండియాకు తొలి వికెట్ దక్కింది. ఈ కమ్రంలో మూడో రోజు తొలి సెషన్ ముగిసేసరికి కివీస్ జట్టు రెండు వికెట్లను మాత్రమే కొల్పోయి పటిష్టమైన స్థితిలో ఉంది. కెప్టెన్ విలియమ్సన్ (18), లేథమ్ (82)తో కలిసి కివీస్ ఇన్నింగ్స్‎ను ముందుకు నడిపించారు. సెషన్ తర్వాత ఆటను ప్రారంభించిన కివీస్‎కు 86 ఓవర్‎లో మూడో బంతికి విలియమ్సన్ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. తొలి సెషన్‎లో అశ్విన్, ఉమేశ్ యాదవ్‎కు తలో వికెట్ దక్కింది. తర్వాత క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్ కూడా అక్షర్ పటేల్ వేసిన 95 ఓవర్‎లో మూడో బంతికి (11) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హెన్రీ నికోల్స్‎ను కూడా అక్షర్ పటేల్ ఔట్ చేయడంతో న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. లేథమ్ (90), టామ్ బీలుండెల్ క్రీజులో కొనసాగుతున్నారు.

Updated Date - 2021-11-27T18:42:47+05:30 IST