Kanpur woman: కట్నం ఇవ్వలేదని భర్త దారుణం.. స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం..

ABN , First Publish Date - 2022-07-31T02:04:44+05:30 IST

ఎన్ని చట్టాలు చేసి, కఠిన శిక్షలు అమలు చేస్తున్నా మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు.

Kanpur woman: కట్నం ఇవ్వలేదని భర్త దారుణం.. స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం..

ఎన్ని చట్టాలు చేసి, కఠిన శిక్షలు అమలు చేస్తున్నా మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ కిరాతకుడు కట్టుకున్న భార్యపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం చేశాడు. ఈ అమానుష ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ (Kanpur) జిల్లాలో జరిగింది. బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  


ఇది కూడా చదవండి..

Kerala Man won lottery: కొన్ని గంటల్లో ఇల్లు అమ్మబోతుండగా జాక్‌పాట్.. రూ. కోటి లాటరీ..


బాధితురాలికి 2020, మార్చి 6 నిందితుడితో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజుల తర్వాతి నుంచి ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. రూ. 2 లక్షలు, కారు కట్నంగా (dowry harassment) కావాలని భర్త, ఆడపడుచు వేధించడం ప్రారంభించారు. అయితే ఆ మహిళ కుటుంబ సభ్యులు వారు అడిగినవి ఇవ్వలేకపోయారు. దీంతో భర్త ఆమెను ఓ గదిలో పెట్టి తాళం వేశాడు. తర్వాత ఒక రోజు ఆమె భర్త తన ముగ్గురు స్నేహితులను ఇంటికి తీసుకొచ్చాడు. వారితో కలిసి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 


ఆ తర్వాత ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు తన పుట్టింటికి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల మద్దతుతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నేరస్థులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు.

Updated Date - 2022-07-31T02:04:44+05:30 IST